🚩 *జి.పి.యస్ పై జరుగుతున్న సమావేశాన్ని బాయ్ కాట్ చేసిన ఏ.పి.టి.ఎఫ్-1938*
🚩 *సిపియస్ ను రద్దుచేసి పాతపెన్షన్ విధానం అమలు చేయాలని ఏ.పి.టి.ఎఫ్-1938 డిమాండ్...*
🅐🅟🅣🅕➊➒➌➑
🖋️ జి.పి. యస్ అమలు కోసం తేది 24-8-23న సచివాలయం నందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యసంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏ.పి.టి.ఎఫ్.-1938 గైర్హాజరు కావాలని నిర్ణయించుకొన్నదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, యస్. చిరంజీవి లు ఒక ప్రకటనలో తెలియజేశారు.
🖋️ గతంలో 6-12-22న జిపియస్ పై జరిగిన సమావేశాన్ని కూడా ఏ.పి.టి.ఎఫ్-1938 బాయ్ కాట్ చేసిన విషయాన్ని వారు తెలియజేశారు.
🖋️ సిపియస్ రద్దు చేసి పాతపెన్షన్ అమలు చేయడమే ఏపిటిఎఫ్ -1938 డిమాండ్ అని జి.పి.యస్ అంగీకారం కాదని లేఖ ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేశామని.
🖋️ మొదటి నుండి కూడా సిపియస్ ను రద్దుచేసి పాతపెన్షన్ విధానం అమలు చేయాలని. -ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని, గతంలో గౌ || ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ కూడా పాతపెన్షన్ అమలుచేస్తామనే గానీ, జి.పి.యస్ ను తెస్తాం అని కాదని అన్నారు. ఇప్పటికి 5 రాష్ట్రాలు ఓ పి యస్ ను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు.
🖋️ అంతేకాకుండా ఏపీటీఎఫ్-1938 దేశంలో, రాష్ట్రాల్లో పాతపెన్షన్ విధానం (OPS) అమలు కోసం జూలై 30వ తేదీన ఇండియన్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 25 సంఘాలతో కలిపి పార్లమెంటు దగ్గర, జంతర్ మంతర్ వద్ద ర్యాలీ, ధర్నా చేయడం జరిగిందని అన్నారు. పాతపెన్షన్ అమలయ్యే వరకు కలసి వచ్చే సంఘాలతో పోరాటం కొనసాగిస్తామని ఏపిటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలియజేశారు.
జి. హృదయరాజు
ఆధ్యకులు
యస్.చిరంజీవి, ప్రధానకార్యదర్శి
*APTF-1938*
🅰️🅿️
🅐🅟🅣🅕➊➒➌➑