జాతీయ విద్యా విధానం 2020 అమలు పేరుతో రాష్ట్రం లోని ప్రాధమిక పాఠశాల లను ముక్కలు చేయవద్దని ఏపీ విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు శనివారం టెక్కలిలో జరిగిన ప్రదర్శన లో 3,4,5 తరగతుల పిల్లలను మూడు కిలోమీటర్ ల దూరం లోని ఉన్నత పాఠశాలలకు తరలించడం తో డ్రాపౌట్ లు పెరుగుతాయని, అలాగే 1,2 తరగతుల పిల్లలను అంగన్వాడీలకు అప్పగించి ఇంటర్మీడియట్ విద్యార్హత గలవారితో బోధన చేయించే ఆలోచన విరమించాలని ఏపీటీయఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవసరమైన 25 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరుతుంటే అదిచేయకుండా ఉన్న యస్ జీ టీ పోస్టులను తరలిస్తూ ఉత్తర్వులను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమం ఉన్నత పాఠశాలల లో కోనసాగించాలని డిమాండ్ చేశారు.
విద్యారంగ మేధావులు,విద్యా పరిరక్షణ కమిటీ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించి విద్యాప్రగతి కి దోహదపడాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమం లో విద్యాపరిరక్షణ కమిటీ మరియు ఏపి టీయఫ్ నాయకులు వై శేషగిరిరావు,కే.సూర్యనారాయణ, గున్న ప్రసాదరావు, యన్ సురేష్ కుమార్, వజ్జ ఆదినారాయణ, కళ్యాణ్ చక్రవర్తి, బమ్మిడి క్రిష్ణారావు, కే చిన్నారావు, శివానంద్, కాంతమ్మ,చిట్టెన్న, ఫల్గుణరావు, నారాయణరావు,వానయ్య,లోకు,నారాయణమూర్తి, మాధవరావు, బీ రామారావు, యం నారాయణమూర్తి, జీ శ్రీనివాసరావు, ఫల్గుణరావు, బీ నారాయణరావు, నాయుడు మోహన్, నాగరాజు, బీ వెంకటరావు తదితరులు కూడా పాల్గోన్నారు
వివిధ రకాల యాప్ ల నిర్వహణ తో ఉపాధ్యాయులకు పనిభారం పెరగడంతో బోధనకు అవకాశం తగ్గినందున ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు.