జిల్లాకు 397 పోస్టుల చొప్పున 12 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4764 SGT పోస్టులను సుప్రేస్(రద్దు )చేస్తూ వాటిని ఏ పి మోడల్ స్కూల్స్ కు బదలాయిస్తూ నేడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది
★ రాష్ట్రవ్యాప్తంగా 4,764 సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
★ ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసం వీటిని విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
★ కర్నూలు మినహా 12 జిల్లాల్లోనూ 397 పోస్టుల చొప్పున రద్దు చేసింది. 2013లో ఆంగ్ల మాధ్యమంతో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు.
★ వీటికి 163 మంది ప్రిన్సిపాళ్లు, 1956 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 1,141 మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ) పోస్టులను మంజూరు చేసింది.
★ వీటిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా సర్వీసు నిబంధనలు లేవు. దీంతో పీఎఫ్, ఆరోగ్యకార్డుల వంటి సదుపాయాలు లభించడం లేదు. సర్వీసు నిబంధనల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
★ ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ విధానంలో సర్వీసు నిబంధనల కోసం ప్రతిపాదించింది.
★ ఆదర్శ పాఠశాలల్లోని మొత్తం 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనలను కల్పించేందుకు ఇప్పటికే ఉన్న 4,764 పోస్టుల విలీనాన్ని ప్రతిపాదించారు. దీంతో 4 వేలకు పైగా పోస్టులను రద్దు చేశారు.
Click Here to Download GO Ms No : 37